PRINT TIME: April 19, 2026 08:18 PM
ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్
ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్
April 19, 2026 05:20 PM
35 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట నియోజకవర్గంలోని వైట్ హౌస్లో ఆదివారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 2వ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించిన సర్వోత్తమ్ రెడ్డి, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం గుడిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి