ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
Editor Desk
తెట్టెలపాడులో గోడపోస్టర్ ఆవిష్కరణ
మార్చి 24, 25 తేదీల్లో కామారెడ్డి లో జరగనున్న అల్ఇం డియా ప్రోగ్రెస్సివే అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపాకుల శివలింగం పిలుపునిచ్చారు.
మహాసభల ప్రచారంలో భాగంగా తేట్టెలపాడు గ్రామంలో గోడపోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగం మాట్లాడుతూ దేశంలో చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్న పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో కోట్లాది మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ కూలీలకు ఏడాది పొడవున ఉపాధి లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి టైమ్మిడి హనుమంత రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాలేరు డివిజన్ అధ్యక్షుడు సోమనపల్లి వెంకటేశ్వర్లు తో పాటు తుపాకుల నాగయ్య, కొండమీద నరసయ్య, తుపాకుల సైదులు, గొడుగు ముత్తమ్మ, కుంబజడ భారతమ్మ, శేఖర్, శ్రీనివాస్, గొడుగు విజయ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి