Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:53 AM

ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
March 16, 2026 08:36 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెట్టెలపాడులో గోడపోస్టర్ ఆవిష్కరణ

మార్చి 24, 25 తేదీల్లో కామారెడ్డి లో జరగనున్న అల్ఇం డియా ప్రోగ్రెస్సివే అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపాకుల శివలింగం పిలుపునిచ్చారు.

మహాసభల ప్రచారంలో భాగంగా తేట్టెలపాడు గ్రామంలో గోడపోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగం మాట్లాడుతూ దేశంలో చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్న పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో కోట్లాది మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ కూలీలకు ఏడాది పొడవున ఉపాధి లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి టైమ్మిడి హనుమంత రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాలేరు డివిజన్ అధ్యక్షుడు సోమనపల్లి వెంకటేశ్వర్లు తో పాటు తుపాకుల నాగయ్య, కొండమీద నరసయ్య, తుపాకుల సైదులు, గొడుగు ముత్తమ్మ, కుంబజడ భారతమ్మ, శేఖర్, శ్రీనివాస్, గొడుగు విజయ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News