Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 10:26 AM

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ

ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ
April 13, 2026 08:54 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడే తీసుకోకపోతే మళ్లీ మూడు నెలల వరకు అందుబాటులో ఉండదన్న భావనతో ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద పొడవైన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా సర్వర్ సమస్యలు తలెత్తడం, ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడం, కొంతమంది దుకాణాల్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పలువురికి ఇంకా రేషన్ అందలేదు. ఈ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అందరికీ క్రమంగా బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News