జిల్లా నాయకులు నకిరేకంటి సతీష్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జరగబోయే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు, పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కొత్త రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల వరకు చేరాలంటే కవితక్క నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.
కొత్త పార్టీలో చేరదలచిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి