PRINT TIME: April 27, 2026 02:57 PM
దుండగుల దాడిలో గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ పరామర్శ
దుండగుల దాడిలో గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ పరామర్శ
April 27, 2026 12:53 PM
67 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షుడు
సూర్యాపేట: ఇటీవల దుండగుల దాడిలో గాయపడి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలు తెలుసుకుని, అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి, దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి