Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:48 PM

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక
April 03, 2026 08:11 AM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్సై చైతన్య కిరణ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, రాయికోడ్ మండలంలోని సమస్త గ్రామ ప్రజలకు ముఖ్య సూచనలు తెలియజేశారు. ఇటీవలి కాలంలో పరిసర ప్రాంతాల్లో దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం అందగా, సమీపంలోని ఝరాసంఘం మండలంలో తాజాగా దొంగతనం జరిగిన ఘటన నమోదైనట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి వేసుకోవాలి, అపరిచిత వ్యక్తులు గ్రామంలో తిరిగితే వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి, గ్రామంలోకి వచ్చే అనుమానాస్పద వాహనాల నంబర్లు నమోదు చేసుకోవాలి, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి, రాత్రివేళ అనవసరంగా బయట తిరగకూడదు. అదనంగా గ్రామాల్లో వాచ్‌మెన్ లేదా కాపలాదారులను నియమించి పహారా ఏర్పాటు చేయాలని, గ్రామ యువత కలిసి రాత్రిపూట పహారా నిర్వహించాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే 100 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను అరికట్టగలమని పేర్కొంటూ, అందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామ సర్పంచ్‌లు ఈ సమాచారాన్ని తమ గ్రామ గ్రూపుల్లో షేర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News