Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రుల ఆర్థిక సహాయం “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 10:25 AM

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక

దొంగల సంచారం పెరుగుతోంది… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై చైతన్య కిరణ్ హెచ్చరిక
April 03, 2026 08:11 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్సై చైతన్య కిరణ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, రాయికోడ్ మండలంలోని సమస్త గ్రామ ప్రజలకు ముఖ్య సూచనలు తెలియజేశారు. ఇటీవలి కాలంలో పరిసర ప్రాంతాల్లో దొంగలు సంచరిస్తున్నట్లు సమాచారం అందగా, సమీపంలోని ఝరాసంఘం మండలంలో తాజాగా దొంగతనం జరిగిన ఘటన నమోదైనట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి వేసుకోవాలి, అపరిచిత వ్యక్తులు గ్రామంలో తిరిగితే వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి, గ్రామంలోకి వచ్చే అనుమానాస్పద వాహనాల నంబర్లు నమోదు చేసుకోవాలి, బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి, రాత్రివేళ అనవసరంగా బయట తిరగకూడదు. అదనంగా గ్రామాల్లో వాచ్‌మెన్ లేదా కాపలాదారులను నియమించి పహారా ఏర్పాటు చేయాలని, గ్రామ యువత కలిసి రాత్రిపూట పహారా నిర్వహించాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే 100 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను అరికట్టగలమని పేర్కొంటూ, అందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామ సర్పంచ్‌లు ఈ సమాచారాన్ని తమ గ్రామ గ్రూపుల్లో షేర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News