దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
Biksham
దండు గ్రామ శివారులోని ప్రసిద్ధ మైసమ్మ ఆలయంలో శనివారం రాత్రి దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లిన వారు, గుడి వెనుక ఉన్న పొలంలో హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నిర్వాహకులు, గుడి వెనుక పొలంలో పగులగొట్టిన హుండీని గుర్తించారు. భక్తుల విరాళాల రూపంలో వచ్చిన నగదు, ఆభరణాలు మొత్తం దుండగులు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని
పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. దుండగులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి