Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
February 03, 2026 01:30 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దండు గ్రామ శివారులోని ప్రసిద్ధ మైసమ్మ ఆలయంలో శనివారం రాత్రి దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లిన వారు, గుడి వెనుక ఉన్న పొలంలో హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నిర్వాహకులు, గుడి వెనుక పొలంలో పగులగొట్టిన హుండీని గుర్తించారు. భక్తుల విరాళాల రూపంలో వచ్చిన నగదు, ఆభరణాలు మొత్తం దుండగులు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని

పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. దుండగులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News