Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:46 PM

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
February 03, 2026 01:30 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దండు గ్రామ శివారులోని ప్రసిద్ధ మైసమ్మ ఆలయంలో శనివారం రాత్రి దుండగులు హుండీ చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లిన వారు, గుడి వెనుక ఉన్న పొలంలో హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నిర్వాహకులు, గుడి వెనుక పొలంలో పగులగొట్టిన హుండీని గుర్తించారు. భక్తుల విరాళాల రూపంలో వచ్చిన నగదు, ఆభరణాలు మొత్తం దుండగులు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని

పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. దుండగులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News