Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:59 AM

డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తాం: నూర్ అహ్మద్

డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తాం: నూర్ అహ్మద్

డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తాం: నూర్ అహ్మద్
May 20, 2026 05:39 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, ఆదోని పట్టణంలోని శిరుగుప్ప రోడ్డు చెక్‌పోస్టు సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డులో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో భారీగా పొగ వెలువడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, సమీప గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఆయన బుధవారం డంపింగ్ యార్డును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

డంపింగ్ యార్డులో వ్యర్థాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిన మున్సిపాలిటీ అధికారులు వ్యర్థాలకు నిప్పు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.

డంపింగ్ యార్డులో మంటలను వెంటనే ఆర్పి పొగను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆదోని మున్సిపాలిటీ అధికారులపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సలహాదారు నరేంద్ర యాదవ్, షకీల్, స్థానిక వ్యాపారులు, రాయనగర్, కొట్టాలు, మదిరె, ఇస్వీ, సంతెకుడ్లూరు, కడితోట, పర్వతాపురం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News