దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు
దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు
Biksham
సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని 30 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, స్వయం ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉపకరణాలను అందజేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి