Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:15 PM

దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు

దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు

దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు
25-04-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని 30 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, స్వయం ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉపకరణాలను అందజేస్తోందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగులకు వాహనాల పంపిణీ – స్వయం ఆధారిత జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు

Article Image

సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని 30 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, స్వయం ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉపకరణాలను అందజేస్తోందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News