Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:08 PM

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
May 26, 2026 06:02 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దివ్యాంగుల సంక్షేమం, వారి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 30 మంది లబ్ధిదారులకు స్కూటీలు, 15 మందికి బ్యాటరీ వీల్‌చైర్లు అందజేశారు.ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగులు స్వయం సమర్థులుగా జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు కూడా ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.టీజీఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. ప్రస్తుతం దివ్యాంగులు విద్య, ఉద్యోగాలు, క్రీడలు, కళారంగాల్లో ప్రతిభ కనబరుస్తూ సవ్యాంగులకు దీటుగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను వెలికితీసుకుని సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.జిల్లా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం జిల్లా సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, షఫీ, నర్సింలు, రాయకోటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News