Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:33 PM

దివ్యాంగుల సమస్యలపై మంత్రి పొన్నంకు వినతి. హామీల అమలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి

దివ్యాంగుల సమస్యలపై మంత్రి పొన్నంకు వినతి. హామీల అమలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి

దివ్యాంగుల సమస్యలపై మంత్రి పొన్నంకు వినతి. హామీల అమలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి
May 21, 2026 12:51 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం సభ్యులు కలిసి దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రవాణా, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కుర్షీద్ మియా, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, సహాయ కార్యదర్శి నాగేష్, చిత్తలూరి వేణు గౌడ్, దూరపల్లి దానమ్మ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News