జిల్లాలో గోదాముల విస్తరణకు చర్యలు.
జిల్లాలో గోదాముల విస్తరణకు చర్యలు.
స్థానికం బృందం
40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్త నిర్మాణాలు – జనఔషధ కేంద్రాల ఏర్పాటుకూ నిర్ణయం
యాదాద్రి భువనగిరి,
జిల్లాలో గోదాముల సదుపాయాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
జిల్లాలో ప్రస్తుతం గోదాముల సౌకర్యం తగినంతగా లేకపోవడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ‘వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ స్టోరేజ్ స్కీమ్’ కింద సహకార సంఘాల ద్వారా ఈ గోదాములను నిర్మించనున్నారు. ఇందుకు నాబార్డు ఆర్థిక సహాయం అందించనుంది.
రైలు, రోడ్డు మార్గాలకు సమీపంలో భూమి అందుబాటులో ఉన్న మూడు సహకార సంఘాలను గుర్తించి అక్కడ గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం పెరుగనుంది.
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉండేలా PACSలలో జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నట్లు జిల్లా సహకార అధికారి మురళి రమణ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి