జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ Anurag Jayanti తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని పేర్కొన్నారు.
ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో అవసరమైనంత గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి