Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:44 PM

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
February 17, 2026 05:49 PM 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

జిల్లాలో ఆదర్శ అంగన్వాడి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా పరిశీలించి పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నూతన ప్రీ స్కూల్ పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలను సమయానికి ప్రారంభించి పోషణ పర్యవేక్షణ పద్ధతి ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

వయోవృద్ధుల పోషణ కేసులు, సమస్యలను వేగంగా పరిష్కరించాలని, మహిళలపై ఎలాంటి అకృత్యాలు జరగకుండా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా శిశు సంరక్షణ, మహిళా సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమంపై చేపట్టవలసిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కే. నరసింహరావు, సూపరిండెంట్ జి. హుస్సేన్, జిల్లా శిశు సంరక్షణ అధికారి రవి కుమార్, అటవీ పరిధి అధికారి బి. వినోద్ కుమార్, సంకల్ప జిల్లా సమన్వయకర్త చైతన్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News