PRINT TIME: March 20, 2026 01:08 PM
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి
March 20, 2026 10:26 AM
14 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
డీసీసీ ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపురం మహేందర్ రెడ్డి
రామన్నపేట, మేజర్ న్యూస్: మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డీసీసీ కమిటీలో మహేందర్ రెడ్డికి ఈ బాధ్యతలు దక్కాయి.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
తన నియామకానికి సహకరించిన ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్లు ఐలయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి