డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, త్రాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి కలెక్టర్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి