దిల్సుఖ్నగర్: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని దిల్సుఖ్నగర్ సిటీ డిపోలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ టీ. సమత అధ్యక్షత వహించగా, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ కళ్యాణి పాల్గొన్నారు.
కార్యక్రమంలో కార్మిక నాయకుడు మోహన్, ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు ఆనంద్, డిపో సెక్రటరీ కనకయ్య, ట్రెజరర్ వెంకన్నతో పాటు డిపో గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
జయంతి వేడుకను డిపో సిబ్బంది ఐక్యంగా నిర్వహించి బాబు జగ్జీవన్ రామ్కు ఘన నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి