డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశాన్ని ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల 75% హాజరు శాతం విధిగా పాటిస్తూ ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరచాలని అన్నారు. ఉన్నత విద్యా మండలి సూచనల మేర నైపుణ్యాభివృద్ధికి ప్రతి విద్యాసంస్థ చర్యలు తీసుకోవాలని అందుకు హాజరు, బోధన పై దృష్టి సారించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య–ఫలిత కేంద్రిత విద్యా నమూనా పై సర్వత్ర చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలిపేందుకు బాధ్యతగా సంస్కరణలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమములో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డా ఎం జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి