Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:21 PM

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
January 22, 2026 06:20 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషి చేయాలి ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్

 మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశాన్ని ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల 75% హాజరు శాతం విధిగా పాటిస్తూ ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరచాలని అన్నారు. ఉన్నత విద్యా మండలి సూచనల మేర నైపుణ్యాభివృద్ధికి ప్రతి విద్యాసంస్థ చర్యలు తీసుకోవాలని అందుకు హాజరు, బోధన పై దృష్టి సారించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య–ఫలిత కేంద్రిత విద్యా నమూనా పై సర్వత్ర చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలిపేందుకు బాధ్యతగా సంస్కరణలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమములో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ డా ఎం జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News