ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం
ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కాపా శ్రీనివాసరావు కి ఆహ్వానం
A Arunkumar
స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:
ఢిల్లీ గణతంత్ర వేడుకలలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా కొత్త రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గర్వకారణంగా నూజివీడు మండలంలో కొత్త రావిచర్ల గ్రామం నిలిచింది.గ్రామాభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేత "రాష్ట్ర ఉత్తమ గ్రామము" మరియు "ఉత్తమ సర్పంచి"గా ఎంపికైన కొత్త రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు కి అరుదైన గౌరవం దక్కింది.
భారత ప్రభుత్వం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ (జనవరి 26, 2026) వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో పాల్గొనవలసిందిగా ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే ఈ ప్రధాన జాతీయ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంతో హాజరుకావడం మన ప్రాంతానికే కాక, రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు,అధికారులు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి అభినందనలు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి