Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:15 PM

ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష. రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు

ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష. రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు

ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష.  రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు
May 27, 2026 01:27 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో వరి ఎగుమతులు, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా జాయింట్ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకరెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని, ధాన్యం తడిసి నష్టపోకుండా వెంటనే లారీలు ఏర్పాటు చేసి ఎగుమతులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్‌బహుదూర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, గుత్త నరసింహారెడ్డి, రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News