ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష. రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు
ధాన్యం తరలింపుపై అధికారుల సమీక్ష. రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు: కాంగ్రెస్ నేతలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో వరి ఎగుమతులు, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా జాయింట్ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకరెడ్డి, ఆర్డీవో శేఖర్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని, ధాన్యం తడిసి నష్టపోకుండా వెంటనే లారీలు ఏర్పాటు చేసి ఎగుమతులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్బహుదూర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, గుత్త నరసింహారెడ్డి, రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి