ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: జిల్లా కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: జిల్లా కలెక్టర్
Krishna
జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ మాధురితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను సమీక్షించారు. జిల్లాలో ప్యాక్స్, డీసీఎంఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించగా, అన్ని కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్ని సంచులు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో చెల్లింపులు సకాలంలో జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి