ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట పట్టణం, దుబ్బాక, మునిపంపుల, ఎన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, తార్పాలిన్లు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి