Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:59 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు.  రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలి
May 24, 2026 03:25 PM 150 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట పట్టణం, దుబ్బాక, మునిపంపుల, ఎన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, తార్పాలిన్‌లు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News