Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:22 PM

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. సర్పంచ్ విక్రమ్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. సర్పంచ్ విక్రమ్

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..  సర్పంచ్ విక్రమ్
May 27, 2026 12:09 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే దిగుమతి చేసుకోవాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ అధికారులను, మిల్లర్లను కోరారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సుమారు ఆరు వేలకుపైగా ధాన్యపు బస్తాలు తూకం వేసి సిద్ధంగా ఉన్నప్పటికీ, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పలువురు అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

రైతుల సమస్యలను విన్న సర్పంచ్ విక్రమ్ స్థానిక రైతులతో కలిసి విద్య ఆగ్రో మిల్లును సందర్శించి నిర్వాహకులతో చర్చించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లు, అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News