ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. సర్పంచ్ విక్రమ్
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. సర్పంచ్ విక్రమ్
Editor Desk
ఇంద్రపాలనగరం: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే దిగుమతి చేసుకోవాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ అధికారులను, మిల్లర్లను కోరారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సుమారు ఆరు వేలకుపైగా ధాన్యపు బస్తాలు తూకం వేసి సిద్ధంగా ఉన్నప్పటికీ, లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పలువురు అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
రైతుల సమస్యలను విన్న సర్పంచ్ విక్రమ్ స్థానిక రైతులతో కలిసి విద్య ఆగ్రో మిల్లును సందర్శించి నిర్వాహకులతో చర్చించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లు, అధికారులకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి