ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!
ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!
K.RAVI
మునుగోడు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం అండ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకటరెడ్డి భరోసా
మునుగోడు నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు కష్టపడి పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే విషయంలో ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావద్దని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు."కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమే రైతుల సంక్షేమం. అన్నదాతలకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది."ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో సహకరించాలని వెంకట్ రెడ్డి కోరారు. ముఖ్యంగా 'తేమ శాతం' పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి