Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:00 AM

ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!

ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!

ధాన్యం గింజ గింజా కొంటాం.. రైతులెవరూ ఆందోళన చెందొద్దు!
May 29, 2026 03:56 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం అండ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకటరెడ్డి భరోసా

మునుగోడు నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుర్కంటి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు కష్టపడి పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

​శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే విషయంలో ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావద్దని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు."కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమే రైతుల సంక్షేమం. అన్నదాతలకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది."​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో సహకరించాలని వెంకట్ రెడ్డి కోరారు. ముఖ్యంగా 'తేమ శాతం' పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News