దేశ భాషలందు తెలుగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స
Krishna
ఖమ్మం స్థానికం ప్రతినిధి
మాతృభాష మహోన్నతమైనదని పరభాష వ్యామోహంలో పడి అది రాక ఇది రాక రెంటాచెడ్డ రేవడి కావద్దని ఖమ్మం నగర పాలక మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. 2026 జనవరి 3,4,5 తేదీలలో ఆంద్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా|| గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రిక ను వారి నివాసం లో మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడరు సి పి బ్రౌన్ తెలుగు కు ఎనలేని కృషి చేసి ఇటా లియన్ ఆఫ్ త ఈస్ట్ అని పరదేశీయులు అజంత భాషగా కొనియాడడం గర్వకారణం అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమం లో సంస్థ గౌరవాధ్యక్షులు బుక్కా సత్యనారాయణ జిల్లా కార్యదర్శి తిరునగరి శ్రీనివాసరావు యువత విభాగం కార్యదర్శి లక్ష్మి నరసింహ చారి కొంపల్లి రామయ్య గుమ్మడి పుల్లయ్య తదితరులు పాలుగోన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి