Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:36 AM

భక్తిశ్రద్ధలతో శీతలమాత బొడ్రాయి 8వ వార్షికోత్సవం..

భక్తిశ్రద్ధలతో శీతలమాత బొడ్రాయి 8వ వార్షికోత్సవం..

భక్తిశ్రద్ధలతో శీతలమాత బొడ్రాయి 8వ వార్షికోత్సవం..
March 10, 2026 06:08 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఘనంగా నాభిశిలా శీతలమాత బొడ్రాయి 8 వ వార్షికోత్సవం..

కోదాడ పట్టణంలో నాభిశిలా శీతలమాత (బొడ్రాయి) 8వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు జరిపారు.పట్టణంలోని వివిధ వార్డుల నుంచి ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని జలాభిషేకాలు జరిపి ముడుపులు, కానుకలు, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ, రైతు కమిటీ, ముత్యాలమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News