Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:01 PM

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి
20-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రేమ, శాంతి, దానగుణానికి నిదర్శనం రంజాన్: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, నెల రోజుల పాటు ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారని తెలిపారు. ఈనెల 21న జరగనున్న రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

సూర్యాపేట నియోజకవర్గంలో రంజాన్ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావానికి సూచికగా నిలుస్తుందని వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తితో ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి

Article Image

ప్రేమ, శాంతి, దానగుణానికి నిదర్శనం రంజాన్: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, నెల రోజుల పాటు ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారని తెలిపారు. ఈనెల 21న జరగనున్న రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

సూర్యాపేట నియోజకవర్గంలో రంజాన్ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావానికి సూచికగా నిలుస్తుందని వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తితో ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News