భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి
భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలి
Biksham Goud
ప్రేమ, శాంతి, దానగుణానికి నిదర్శనం రంజాన్: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, నెల రోజుల పాటు ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారని తెలిపారు. ఈనెల 21న జరగనున్న రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
సూర్యాపేట నియోజకవర్గంలో రంజాన్ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, సోదరభావానికి సూచికగా నిలుస్తుందని వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తితో ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి