Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:55 PM

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు
May 05, 2026 07:27 PM 671 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన భక్తులు చార్ధామ్ యాత్రను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలిపటేల్ ప్రభు ఆధ్వర్యంలో, భవాని శ్రీనివాస్ సమన్వయంతో 14 మంది భక్తులతో కూడిన బృందం ఏప్రిల్ 26న యాత్రను ప్రారంభించి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మే 3న హిమాలయ పర్వతాల్లో వెలసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్‌లో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ చార్ధామ్ యాత్రపై అనవసర అపోహలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని, యాత్ర ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. ఓపిక, భక్తి, శారీరక సన్నద్ధతతో ఎవరైనా ఈ యాత్రలో పాల్గొని యమునోత్రి, గంగోత్రి, కేదారేశ్వర, బద్రీనాథ్ దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News