Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై హైకోర్టు తలుపుతట్టిన టీడబ్ల్యూజేఎఫ్ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 08:48 PM

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు

భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు
May 05, 2026 07:27 PM 213 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన భక్తులు చార్ధామ్ యాత్రను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలిపటేల్ ప్రభు ఆధ్వర్యంలో, భవాని శ్రీనివాస్ సమన్వయంతో 14 మంది భక్తులతో కూడిన బృందం ఏప్రిల్ 26న యాత్రను ప్రారంభించి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మే 3న హిమాలయ పర్వతాల్లో వెలసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్‌లో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ చార్ధామ్ యాత్రపై అనవసర అపోహలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని, యాత్ర ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. ఓపిక, భక్తి, శారీరక సన్నద్ధతతో ఎవరైనా ఈ యాత్రలో పాల్గొని యమునోత్రి, గంగోత్రి, కేదారేశ్వర, బద్రీనాథ్ దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News