భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు
భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర పూర్తి చేస్తున్న సదాశివపేట యాత్రికులు
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన భక్తులు చార్ధామ్ యాత్రను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలిపటేల్ ప్రభు ఆధ్వర్యంలో, భవాని శ్రీనివాస్ సమన్వయంతో 14 మంది భక్తులతో కూడిన బృందం ఏప్రిల్ 26న యాత్రను ప్రారంభించి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మే 3న హిమాలయ పర్వతాల్లో వెలసిన పవిత్ర క్షేత్రం కేదార్నాథ్లో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ చార్ధామ్ యాత్రపై అనవసర అపోహలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల కోసం చక్కటి ఏర్పాట్లు చేసిందని, యాత్ర ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. ఓపిక, భక్తి, శారీరక సన్నద్ధతతో ఎవరైనా ఈ యాత్రలో పాల్గొని యమునోత్రి, గంగోత్రి, కేదారేశ్వర, బద్రీనాథ్ దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందవచ్చని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి