భక్తి జోష్లో కోలాటాలు.. స్వామివారికి ఘన స్వాగతం
రామన్నపేట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.
ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారిని పల్లకిపై గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని గ్రామపంచాయతీ పరిధిలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంలో సాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి