Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:29 AM

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం
27-03-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తి జోష్‌లో కోలాటాలు.. స్వామివారికి ఘన స్వాగతం

రామన్నపేట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారిని పల్లకిపై గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని గ్రామపంచాయతీ పరిధిలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంలో సాగింది.

Sthanikam

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

Article Image

భక్తి జోష్‌లో కోలాటాలు.. స్వామివారికి ఘన స్వాగతం

రామన్నపేట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారిని పల్లకిపై గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని గ్రామపంచాయతీ పరిధిలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంలో సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News