Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:21 PM

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం

భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం
March 27, 2026 09:16 PM 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తి జోష్‌లో కోలాటాలు.. స్వామివారికి ఘన స్వాగతం

రామన్నపేట: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారిని పల్లకిపై గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని గ్రామపంచాయతీ పరిధిలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంలో సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News