దేవస్థానానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన
దేవస్థానానికి సీసీ రోడ్డుకు శంకుస్థాపన
Biksham
10వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం
సూర్యాపేట: పట్టణంలోని 10వ వార్డు కుప్పిరెడ్డి గూడెంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానానికి వెళ్లే సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది, 10వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వెక్కంటి శేఖర్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేవస్థానానికి వెళ్లే రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా భక్తులకు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, సండ్రపాటి విజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పందిరి మల్లేష్ గౌడ్, 10వ వార్డు కాంగ్రెస్ నాయకులు వెక్కంటి వెంకట్ రెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి, బోళ్ల దయాకర్ రెడ్డి, ఆవుల దయాకర్ రెడ్డి, మాదిరెడ్డి కృష్ణారెడ్డి, మందాడి వెంకట్ రెడ్డి, రేగిరెడ్డి సైదిరెడ్డి, కనుకు వెంకన్న, ఆదిమల్ల కృష్ణ, కనుకు రేణుక, కట్ట నరేష్, చిట్లాంకి యాదగిరి, కెటి అన్నారం మాజీ సర్పంచ్ భీమిరెడ్డి, కాంట్రాక్టర్ కోడిదల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి