డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్
డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్
Editor Desk
జనగణనలో జాగ్రత్తలు తప్పనిసరి
భువనగిరి: జనాభా లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కచ్చితత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జనగణన–2027 ఫేజ్-1 గృహాల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ తరగతుల చివరి రోజున కలెక్టర్ పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్లకు మార్గదర్శకాలు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డేటా సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
జనగణన నిబంధనలను పూర్తిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్లో చేస్తున్న పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి