Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్

డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్

డేటా నమోదు కచ్చితంగా చేయాలి..  కలెక్టర్
26-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణనలో జాగ్రత్తలు తప్పనిసరి

భువనగిరి: జనాభా లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కచ్చితత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జనగణన–2027 ఫేజ్-1 గృహాల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ తరగతుల చివరి రోజున కలెక్టర్ పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మార్గదర్శకాలు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డేటా సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

జనగణన నిబంధనలను పూర్తిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్‌లో చేస్తున్న పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డేటా నమోదు కచ్చితంగా చేయాలి.. కలెక్టర్

Article Image

జనగణనలో జాగ్రత్తలు తప్పనిసరి

భువనగిరి: జనాభా లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కచ్చితత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జనగణన–2027 ఫేజ్-1 గృహాల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ తరగతుల చివరి రోజున కలెక్టర్ పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మార్గదర్శకాలు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డేటా సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

జనగణన నిబంధనలను పూర్తిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్‌లో చేస్తున్న పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News