Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:26 PM

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం
03-02-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 07వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశపాక లత – రాజేష్‌కు మద్దతుగా నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఎమ్మెల్యే వీరేశం గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, పేద కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

07వ వార్డులో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలను సమగ్రంగా గుర్తించి, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే 07వ వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే, 07వ వార్డు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం

Article Image

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 07వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశపాక లత – రాజేష్‌కు మద్దతుగా నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఎమ్మెల్యే వీరేశం గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, పేద కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

07వ వార్డులో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలను సమగ్రంగా గుర్తించి, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే 07వ వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే, 07వ వార్డు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News