Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:42 AM

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం

దేశపాక లత రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే వీరేశం ప్రచారం
February 03, 2026 12:30 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 07వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశపాక లత – రాజేష్‌కు మద్దతుగా నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఎమ్మెల్యే వీరేశం గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, పేద కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

07వ వార్డులో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలను సమగ్రంగా గుర్తించి, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే 07వ వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే, 07వ వార్డు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News