Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

దేశానికి దశ దిశ చూపించింది బీజేపీ;సంకినేని రవీందర్రావు

దేశానికి దశ దిశ చూపించింది బీజేపీ;సంకినేని రవీందర్రావు

దేశానికి దశ దిశ చూపించింది బీజేపీ;సంకినేని రవీందర్రావు
April 06, 2026 07:29 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతదేశానికి దశ దిశ చూపించి అన్ని రంగాల్లో అబివుద్ది చేసిన ఘనత బీజేపీ పార్టీదే అనిబీజేపీ రాష్ట్ర నాయకులు సంకినని రవీందర్రావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బొంబాయినగరంలో ఆవిర్భావించిన బీజేపీ పార్టీ అతి తక్కువ కాలంలో దేశంలో అధికారం సాధించి అనేక అబివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చూట్టిందన్నారు. ఆటల్ బిహారి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంతో పాటు నేడు మూడు దఫాలుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ వరకు ఆనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అభివృద్ధి జరిగిందన్నారు. దేశంలోని మారు మూల పల్లె వరకు అర్హులైన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంతో నేడు లబ్ది పొందుతున్నారని ఆన్నారు. గత ప్రభుత్వాల కాలంలో పరిష్కారం కాని అనేక సమస్యలను బీజేపీ అధికారంలో నరేంద్రమోదీ పరిష్కరించి దేశ కీర్తిని పెంచారన్నారు. అందుకే ప్రజలు దేశంలోని 350పార్లమెంట్ స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించి మూడోసారి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి పాటు పడుతున్న బీజేపీ పార్టీకి అండగా నిలువాల్సిన బాద్యత ప్రజలందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమం లో తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా , ఉప సర్పంచ్ శ్రీనివాస్ , మాజీ ఎంపీటీసీ ఉప్పుల లింగయ్య , మాజీ సర్పంచులు అంబటి రమేష్, గడ్డo ఉప్పలయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు ఎలగందుల రామచంద్రు, పెండం యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి సంకృనాయక్, వెంకన్న,బండి నవీన్,సందీప్, శ్రీశైలం, సాయి కృష్ణ, రఫిక్, రవి , గణేష్, శ్యామ్, గుంజ విజయ్,మహేష్,లింగన్న,నరేందర్, వెంకన్న,సంజయ్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు ,బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, మండల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News