Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 09:32 PM

దేశానికి దశ దిశ చూపించింది బీజేపీ;సంకినేని రవీందర్రావు

దేశానికి దశ దిశ చూపించింది బీజేపీ;సంకినేని రవీందర్రావు

దేశానికి దశ దిశ చూపించింది బీజేపీ;సంకినేని రవీందర్రావు
April 06, 2026 07:29 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతదేశానికి దశ దిశ చూపించి అన్ని రంగాల్లో అబివుద్ది చేసిన ఘనత బీజేపీ పార్టీదే అనిబీజేపీ రాష్ట్ర నాయకులు సంకినని రవీందర్రావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బొంబాయినగరంలో ఆవిర్భావించిన బీజేపీ పార్టీ అతి తక్కువ కాలంలో దేశంలో అధికారం సాధించి అనేక అబివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చూట్టిందన్నారు. ఆటల్ బిహారి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంతో పాటు నేడు మూడు దఫాలుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ వరకు ఆనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా అభివృద్ధి జరిగిందన్నారు. దేశంలోని మారు మూల పల్లె వరకు అర్హులైన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంతో నేడు లబ్ది పొందుతున్నారని ఆన్నారు. గత ప్రభుత్వాల కాలంలో పరిష్కారం కాని అనేక సమస్యలను బీజేపీ అధికారంలో నరేంద్రమోదీ పరిష్కరించి దేశ కీర్తిని పెంచారన్నారు. అందుకే ప్రజలు దేశంలోని 350పార్లమెంట్ స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించి మూడోసారి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి పాటు పడుతున్న బీజేపీ పార్టీకి అండగా నిలువాల్సిన బాద్యత ప్రజలందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమం లో తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా , ఉప సర్పంచ్ శ్రీనివాస్ , మాజీ ఎంపీటీసీ ఉప్పుల లింగయ్య , మాజీ సర్పంచులు అంబటి రమేష్, గడ్డo ఉప్పలయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు ఎలగందుల రామచంద్రు, పెండం యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి సంకృనాయక్, వెంకన్న,బండి నవీన్,సందీప్, శ్రీశైలం, సాయి కృష్ణ, రఫిక్, రవి , గణేష్, శ్యామ్, గుంజ విజయ్,మహేష్,లింగన్న,నరేందర్, వెంకన్న,సంజయ్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు ,బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, మండల సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News