PRINT TIME: March 19, 2026 04:41 PM
దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి
దీక్ష విరమణకు ముగింపు.. డిమాండ్కు బలం. వంద పడకల ఆస్పత్రి అవసరమే: ఆర్డీఓ శేఖర్ రెడ్డి
March 19, 2026 03:11 PM
25 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వాస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచాలన్న డిమాండ్కు అధికారుల మద్దతు లభించింది.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షను బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసిల్దార్ లాల్ బహుదూర్ నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలన్న ప్రజల డిమాండ్ సమంజసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, నూతన భవనాలు నిర్మించడం అత్యవసరమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ, “ఆస్పత్రి అప్గ్రేడ్ సాధించే వరకు పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి