డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు
డీఎస్సీ,సిఐ,ఎస్సైకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు
Sthanikam joint District Staff Reporter krishna
జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ డీఎస్సీ కార్యాలయంలో జహీరాబాద్ డిఎస్పి సైదా, జహీరాబాద్ సిఐ శివలింగం, కోహీర్ ఎస్సై నరేష్ ను గురుజువాడ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా, మార్చి 1వ తేదీన గురుజువాడ గ్రామంలో ఘనంగా జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు తెలియజేసి, వేడుకను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు వినమ్రంగా ఆహ్వానించారు.దేశభక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని యువతకు అందించాలనే లక్ష్యంతో, ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సమష్టి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలు మార్చి 1వ తేదీన జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జరుపుకునేందుకు మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి