స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల:
అతివేగంగా ద్విచక్ర వాహనం నడపడం ఓ వ్యక్తి ప్రాణాన్ని హరించింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన పగిండ్ల ఉప్పలయ్య (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
హైదరాబాదు వైపు వెళ్తుండగా గుండ్రంపల్లి గ్రామ శివారులోని Bharath పెట్రోల్ బంక్ సమీపంలో సాయంత్రం సమయంలో స్కూటీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డు, చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఉప్పలయ్యకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు అతన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్.బి.నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి