విసన్నపేట : ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రూ.30 వేల రూపాయలు విలువ గల క్రీడా సామగ్రిని అందించిన దాత ఎన్.టి. వెంకటేశ్వరరావును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. శోభాలత ఘనంగా సన్మానించారు.
పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కవి, రచయిత, సినీ దర్శకుడు బి.వి. రత్నం సన్మాన పత్రాన్ని రచించారు. ఈ కార్యక్రమం పీడీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొని దాతను అభినందించారు. సమాజ సేవలో ముందుండే ఎన్.టి. వెంకటేశ్వరరావు దానధర్మాలలో ఎప్పుడూ ముందుండి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు. “చేతికి ఎముకలేని దాత”గా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి