Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 04:24 AM

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
February 27, 2026 07:08 PM 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News