Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:55 AM

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
February 27, 2026 07:08 PM 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News