డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
డ్రైవర్లకు కంటి పరీక్షలు… రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
K.RAVI
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రివ్ అలీవ్ కాంపెయిన్ –2026 కార్యక్రమంలో భాగంగా గురువారం మల్కాపూర్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్ ) సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్, వారి సిబ్బంది హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని, సురక్షిత ప్రయాణంతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి