డ్రైవర్ అశోక్కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
డ్రైవర్ అశోక్కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Komidala Mahender reddy
జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని సూచిస్తూ అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అశోక్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అధికార పార్టీ చిన్న విషయంపై అతిగా స్పందించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ అశోక్పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అశోక్ చెప్పిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి తేల్చిచెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి