Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:30 AM

డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
26-05-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని సూచిస్తూ అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అశోక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అధికార పార్టీ చిన్న విషయంపై అతిగా స్పందించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ అశోక్‌పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అశోక్ చెప్పిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి తేల్చిచెప్పారు.

Sthanikam

డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Article Image

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని సూచిస్తూ అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అశోక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అధికార పార్టీ చిన్న విషయంపై అతిగా స్పందించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ అశోక్‌పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అశోక్ చెప్పిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి తేల్చిచెప్పారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News