Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

డ్రగ్స్‌కు నో చెప్పాలి: యువతకు ఏసీపీ శివం నాయుడు పిలుపు

డ్రగ్స్‌కు నో చెప్పాలి: యువతకు ఏసీపీ శివం నాయుడు పిలుపు

డ్రగ్స్‌కు నో చెప్పాలి: యువతకు ఏసీపీ శివం నాయుడు పిలుపు
March 24, 2026 06:34 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కూసుమంచి గ్రామంలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఈగల్ టీం ఏసీపీ శివం నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీపీ శివం నాయుడు మాట్లాడుతూ, సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ అనే మత్తు పదార్థాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని, ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని అన్నారు.

సర్పంచ్ కొండా క్రిష్ణవేణి మాట్లాడుతూ, గ్రామాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత చదువు, క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు.

మండల విద్యాశాఖ అధికారి రాయల వీరస్వామి మాట్లాడుతూ, డ్రగ్స్ అనే సామాజిక ముప్పు నుండి యువత దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలపై పడే ప్రభావాల గురించి వివరించారు.

కూసుమంచి ఎస్సై నాగరాజు మాట్లాడుతూ, చెడు స్నేహాల వల్ల కొంతమంది యువకులు మత్తు పదార్థాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బిక్షం నాయక్, వెంకటేష్ నాయక్, గ్రామ పంచాయతీ సభ్యులు, కార్యదర్శి నీరజ, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో నిర్వాహకులు ముఖ్య అతిథికి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News