Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలువలో మునిగి యువకుడు మృతి బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 07:50 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి: అదనపు ఎస్పీ చైతన్య పిలుపు

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి: అదనపు ఎస్పీ చైతన్య పిలుపు

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి: అదనపు ఎస్పీ చైతన్య పిలుపు
May 02, 2026 05:57 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాల సందర్భంగా శనివారం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు పోలీసు సూపరింటెండెంట్ చైతన్య మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల శారీరక, మానసిక సామర్థ్యాలు దెబ్బతిని భవిష్యత్తు నాశనం కావచ్చని హెచ్చరించారు. యువత తాత్కాలిక ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై ఏకాగ్రత పెంచుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు వంటి ఆధునిక సమస్యలపై కూడా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ యువత డ్రగ్స్ ప్రమాదాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం డీఎస్పీ పుష్పస్ కుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, సత్తయ్య, డీసీపీఓ రత్నం, ఏఎఫ్‌డబ్ల్యుఓ సతీష్, లింగం, యాదగిరి, డీసీపీఎస్ సిబ్బంది, ఓమేరా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News