Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 11:24 PM

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు
March 26, 2026 09:15 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కుల కుటుంబాలు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రవాణా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం వంటి విభాగాల్లో బ్యాంకు రుణంతో పాటు 100 శాతం సబ్సిడీతో పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, యంత్రాల హైరింగ్ సెంటర్లు, సోలార్ పంప్ సెట్లు, పాడి గేదెల పంపిణీ వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా వేతన, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండే వారు అర్హులని స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), భూమి పత్రాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News