Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:05 AM

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు
26-03-2026 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కుల కుటుంబాలు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రవాణా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం వంటి విభాగాల్లో బ్యాంకు రుణంతో పాటు 100 శాతం సబ్సిడీతో పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, యంత్రాల హైరింగ్ సెంటర్లు, సోలార్ పంప్ సెట్లు, పాడి గేదెల పంపిణీ వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా వేతన, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండే వారు అర్హులని స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), భూమి పత్రాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

Sthanikam

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కుల కుటుంబాలు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రవాణా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం వంటి విభాగాల్లో బ్యాంకు రుణంతో పాటు 100 శాతం సబ్సిడీతో పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, యంత్రాల హైరింగ్ సెంటర్లు, సోలార్ పంప్ సెట్లు, పాడి గేదెల పంపిణీ వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా వేతన, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండే వారు అర్హులని స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), భూమి పత్రాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News