Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:20 AM

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు

దళితులకు స్వయం ఉపాధి పథకాల దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 2 వరకు
March 26, 2026 09:15 PM 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కుల కుటుంబాలు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రవాణా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం వంటి విభాగాల్లో బ్యాంకు రుణంతో పాటు 100 శాతం సబ్సిడీతో పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, యంత్రాల హైరింగ్ సెంటర్లు, సోలార్ పంప్ సెట్లు, పాడి గేదెల పంపిణీ వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా వేతన, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండే వారు అర్హులని స్పష్టం చేశారు.

దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), భూమి పత్రాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News