Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:54 AM

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి
March 16, 2026 02:31 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్ టి. వెంకట రామరావు ఆత్మశాంతి కోసం నిర్వహించిన ఉదక శాంతి మరియు ద్వాదశ దిన (12వ రోజు) కర్మ కార్యక్రమాలు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ క్రతువులు సాగాయి.

తన పెద్దనాన్న కుమారుడు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ జితేందర్ రావు తనుగుల ఈ కార్యక్రమాలను కుటుంబ బాధ్యతగా భావించి అంత్యక్రియల నుంచి ద్వాదశ దిన కర్మ వరకు అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆయన సతీమణి రేణుకతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మరణించిన వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు. డాక్టర్ రామరావు ధర్మపత్ని శ్రీదేవి (చిన్నమ్మ) తన భర్తతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుమార్తెలు శిరీష, హిమబిందు, ఇందిర ప్రియదర్శిని తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అల్లుడు శశికుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు సతీష్ కుమార్, శశికళ, జ్యోతి, సుహర్షి, హర్ష, చంద్రిక, ధనుష్ మరియు మనవలు, మనవరాళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖులు డాక్టర్ టి.ఆర్.కే. రావు (డైరెక్టర్ జనరల్, మైనింగ్ – నాగ్‌పూర్), డాక్టర్ జితేందర్ రావు తల్లి రేవతి తదితరులు హాజరై నివాళులర్పించారు. కార్యక్రమం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగేందుకు శ్రీ సదాశివరావు విష్ణుదాస్ విశేష కృషి చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News