Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:21 PM

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి

డాక్టర్ టి. వెంకట రామరావుకు అశ్రునివాళి
March 16, 2026 02:31 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్ టి. వెంకట రామరావు ఆత్మశాంతి కోసం నిర్వహించిన ఉదక శాంతి మరియు ద్వాదశ దిన (12వ రోజు) కర్మ కార్యక్రమాలు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ క్రతువులు సాగాయి.

తన పెద్దనాన్న కుమారుడు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ జితేందర్ రావు తనుగుల ఈ కార్యక్రమాలను కుటుంబ బాధ్యతగా భావించి అంత్యక్రియల నుంచి ద్వాదశ దిన కర్మ వరకు అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆయన సతీమణి రేణుకతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మరణించిన వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు. డాక్టర్ రామరావు ధర్మపత్ని శ్రీదేవి (చిన్నమ్మ) తన భర్తతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుమార్తెలు శిరీష, హిమబిందు, ఇందిర ప్రియదర్శిని తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అల్లుడు శశికుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు సతీష్ కుమార్, శశికళ, జ్యోతి, సుహర్షి, హర్ష, చంద్రిక, ధనుష్ మరియు మనవలు, మనవరాళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖులు డాక్టర్ టి.ఆర్.కే. రావు (డైరెక్టర్ జనరల్, మైనింగ్ – నాగ్‌పూర్), డాక్టర్ జితేందర్ రావు తల్లి రేవతి తదితరులు హాజరై నివాళులర్పించారు. కార్యక్రమం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగేందుకు శ్రీ సదాశివరావు విష్ణుదాస్ విశేష కృషి చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News