Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నీలం మధు ముదిరాజ్..

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నీలం మధు ముదిరాజ్..

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నీలం మధు ముదిరాజ్..
February 20, 2026 11:30 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెద్ద శంకరంపేటలో ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ..

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ భక్తి మార్గం ద్వారానే మనిషికి సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. దైవ చింతనతో మనసుకు స్థిరత్వం, జీవనానికి దిశ లభిస్తాయని చెప్పారు. గ్రామాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రజల మధ్య సోదరభావం పెంపొందుతుందని, ఐక్యత మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.గంగమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై నిలిచి ఉండాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా వర్థిల్లాలని ఆకాంక్షించారు.ఉత్తులూరు గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరుడి శ్రావణిసాయిలు, మాజీ సర్పంచ్ మంద మల్లేష్, సతీష్, పెంటయ్య, దుర్గయ్య, బ్యతయ్య, చంద్రయ్య, సాయిలు, దశరథ్, సంగయ్య, అశోక్, రాములు, పెంటన్న, ఈర గౌడ్, ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం భక్తి భావంతో, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News