Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన
22-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిరుమలగిరి: మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉండగా, వాటిని కొంతమంది భూస్వాములు, స్థానికులు పశువుల కొట్లుగా ఉపయోగించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజాధనంతో నిర్మించిన ఈ ఇండ్లలో ప్రజలు నివసించాల్సి ఉండగా, బర్లకు, గొర్రెలకు, గడ్డి కట్టలకు, ఎడ్ల బండ్లకు, ట్రాక్టర్లకు నిల్వగా ఉపయోగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇండ్లు లేని పేద కుటుంబాలు గత నెల రోజులుగా అక్కడికక్కడే చెట్ల కింద, పిల్లర్ల వద్ద వంట చేసుకుంటూ ఎండలోనే నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “ఈ పశువులను, బండ్లను, గడ్డివాములను ఖాళీ చేస్తే మేము శుభ్రం చేసుకుని ఉంటాం” అంటూ వేడుకున్నా, ఆక్రమణదారులు కనికరం చూపడంలేదని వారు వాపోతున్నారు.

అంతేకాకుండా రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ, కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న బెల్లి యాదగిరి సహా పలువురు ఈ ఇండ్లను ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. వారిలో షీలా ఆగయ్య, కన్నబోయిన లింగయ్య, కన్నెబోయిన కోటయ్య, ఎరుపుల లింగస్వామి, మెరుగు వెంకన్న, వజ్జే లింగయ్య, మెరుగు కనకయ్య, మెరుగు గణేష్, రఘు, వజ్జే శంకరమ్మ తదితరులు ఉన్నారని తెలిపారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

Article Image

తిరుమలగిరి: మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉండగా, వాటిని కొంతమంది భూస్వాములు, స్థానికులు పశువుల కొట్లుగా ఉపయోగించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజాధనంతో నిర్మించిన ఈ ఇండ్లలో ప్రజలు నివసించాల్సి ఉండగా, బర్లకు, గొర్రెలకు, గడ్డి కట్టలకు, ఎడ్ల బండ్లకు, ట్రాక్టర్లకు నిల్వగా ఉపయోగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇండ్లు లేని పేద కుటుంబాలు గత నెల రోజులుగా అక్కడికక్కడే చెట్ల కింద, పిల్లర్ల వద్ద వంట చేసుకుంటూ ఎండలోనే నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “ఈ పశువులను, బండ్లను, గడ్డివాములను ఖాళీ చేస్తే మేము శుభ్రం చేసుకుని ఉంటాం” అంటూ వేడుకున్నా, ఆక్రమణదారులు కనికరం చూపడంలేదని వారు వాపోతున్నారు.

అంతేకాకుండా రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ, కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న బెల్లి యాదగిరి సహా పలువురు ఈ ఇండ్లను ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. వారిలో షీలా ఆగయ్య, కన్నబోయిన లింగయ్య, కన్నెబోయిన కోటయ్య, ఎరుపుల లింగస్వామి, మెరుగు వెంకన్న, వజ్జే లింగయ్య, మెరుగు కనకయ్య, మెరుగు గణేష్, రఘు, వజ్జే శంకరమ్మ తదితరులు ఉన్నారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News