Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:19 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఆక్రమణలు.. పేదల ఆవేదన
March 22, 2026 02:41 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిరుమలగిరి: మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉండగా, వాటిని కొంతమంది భూస్వాములు, స్థానికులు పశువుల కొట్లుగా ఉపయోగించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజాధనంతో నిర్మించిన ఈ ఇండ్లలో ప్రజలు నివసించాల్సి ఉండగా, బర్లకు, గొర్రెలకు, గడ్డి కట్టలకు, ఎడ్ల బండ్లకు, ట్రాక్టర్లకు నిల్వగా ఉపయోగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇండ్లు లేని పేద కుటుంబాలు గత నెల రోజులుగా అక్కడికక్కడే చెట్ల కింద, పిల్లర్ల వద్ద వంట చేసుకుంటూ ఎండలోనే నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “ఈ పశువులను, బండ్లను, గడ్డివాములను ఖాళీ చేస్తే మేము శుభ్రం చేసుకుని ఉంటాం” అంటూ వేడుకున్నా, ఆక్రమణదారులు కనికరం చూపడంలేదని వారు వాపోతున్నారు.

అంతేకాకుండా రాత్రి వేళల్లో మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ, కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న బెల్లి యాదగిరి సహా పలువురు ఈ ఇండ్లను ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. వారిలో షీలా ఆగయ్య, కన్నబోయిన లింగయ్య, కన్నెబోయిన కోటయ్య, ఎరుపుల లింగస్వామి, మెరుగు వెంకన్న, వజ్జే లింగయ్య, మెరుగు కనకయ్య, మెరుగు గణేష్, రఘు, వజ్జే శంకరమ్మ తదితరులు ఉన్నారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News