Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:20 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 26, 2026 03:47 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News