Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:27 PM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 26, 2026 03:47 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హాల్‌లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.

సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News