డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
భువనగిరి,డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
గురువారం మినీ మీటింగ్ హాల్లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి గ్రామాల్లోని ఇండ్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇండ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి సంబంధించిన మౌళిక సదుపాయాలు పూర్తిగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు.
సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పీఆర్ ఈఈ దసయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి