డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్
డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్
Harish HS
విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో రాణించాలి: ఈజీఎమ్ మురళీకృష్ణ
శ్రీ చైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో డా,, బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను బుధవారం ఏర్పాటు చేసినారు. ఈ స్పోర్ట్స్ కు విజయవాడ జోనల్ జోన్ విద్యార్థులు, నందిగామ జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, కోదాడ విద్యార్థులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ చైతన్య ఈజిఎం మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇటువంటి ఆటలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్ఐ వెంకటేశ్వర్లు, విజయవాడ ఆర్ఐ వినోద్, ప్రిన్సిపాల్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్, శేష్ బాబు, హనుమంతరావు, జోనల్ కోఆర్డినేటర్ వెంకట్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి