Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:59 PM

చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు

చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు

చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు
26-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ,

మండలంలోని చిత్తాపురం గ్రామం నుండి గోపరాజుపల్లి వరకు ఉన్న రహదారిని తక్షణమే విస్తరించాలని సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ రహదారి సుమారు 33 అడుగుల వెడల్పుతో ఉండేదని, కాలక్రమేణా ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 12 నుంచి 13 అడుగులకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ఫలితంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

తక్షణమే భూసర్వే నిర్వహించి రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి, రెండు వాహనాలు సులభంగా వెళ్లే విధంగా రహదారిని విస్తరించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు స్పందించని పక్షంలో చిత్తాపురం, గోపరాజుపల్లి గ్రామాల ప్రజలను సమీకరించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు

Article Image

వలిగొండ,

మండలంలోని చిత్తాపురం గ్రామం నుండి గోపరాజుపల్లి వరకు ఉన్న రహదారిని తక్షణమే విస్తరించాలని సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ రహదారి సుమారు 33 అడుగుల వెడల్పుతో ఉండేదని, కాలక్రమేణా ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 12 నుంచి 13 అడుగులకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ఫలితంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

తక్షణమే భూసర్వే నిర్వహించి రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి, రెండు వాహనాలు సులభంగా వెళ్లే విధంగా రహదారిని విస్తరించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు స్పందించని పక్షంలో చిత్తాపురం, గోపరాజుపల్లి గ్రామాల ప్రజలను సమీకరించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News