చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు
చిత్తాపురం–గోపరాజుపల్లి రహదారి వెంటనే విస్తరించాలి — సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు
స్థానికం బృందం
వలిగొండ,
మండలంలోని చిత్తాపురం గ్రామం నుండి గోపరాజుపల్లి వరకు ఉన్న రహదారిని తక్షణమే విస్తరించాలని సిపిఎం సీనియర్ నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ రహదారి సుమారు 33 అడుగుల వెడల్పుతో ఉండేదని, కాలక్రమేణా ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 12 నుంచి 13 అడుగులకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. ఫలితంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
తక్షణమే భూసర్వే నిర్వహించి రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించి, రెండు వాహనాలు సులభంగా వెళ్లే విధంగా రహదారిని విస్తరించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు స్పందించని పక్షంలో చిత్తాపురం, గోపరాజుపల్లి గ్రామాల ప్రజలను సమీకరించి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి