Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:33 AM

చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం

చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం

చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం
26-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరణ


చింతలపూడి: గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చడంలో కో-ఆపరేటివ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తక్కువ వడ్డీతో రుణాలు, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు ఈ సొసైటీ ద్వారా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాక్స్ సొసైటీ చైర్మన్ మరియు సీఏ దాకారపు కృష్ణ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శకంగా సేవలు అందిస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సహకారం కొనసాగాలని కోరారు.

కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కూటమి ప్రతినిధులు, బ్యాంకు నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం

Article Image

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరణ


చింతలపూడి: గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చడంలో కో-ఆపరేటివ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తక్కువ వడ్డీతో రుణాలు, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు ఈ సొసైటీ ద్వారా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాక్స్ సొసైటీ చైర్మన్ మరియు సీఏ దాకారపు కృష్ణ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శకంగా సేవలు అందిస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సహకారం కొనసాగాలని కోరారు.

కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కూటమి ప్రతినిధులు, బ్యాంకు నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News