చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం
చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభం
GADDAM JAGANMOHAN REDDY
ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరణ
చింతలపూడి: గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చింతలపూడిలో శ్రీ మద్ది ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చడంలో కో-ఆపరేటివ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తక్కువ వడ్డీతో రుణాలు, ఆకర్షణీయ డిపాజిట్ పథకాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు ఈ సొసైటీ ద్వారా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాక్స్ సొసైటీ చైర్మన్ మరియు సీఏ దాకారపు కృష్ణ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా పారదర్శకంగా సేవలు అందిస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సహకారం కొనసాగాలని కోరారు.
కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కూటమి ప్రతినిధులు, బ్యాంకు నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి