చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు
చింతలపూడికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరు
GADDAM JAGANMOHAN REDDY
చింతలపూడి పట్టణానికి రెండు జూనియర్ సివిల్ కోర్టుల భవనాలు మంజూరుకానున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ న్యాయశాఖ మంత్రి మరియు న్యాయశాఖ కార్యదర్శి లను శుక్రవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
చింతలపూడిలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు భవనాలు అత్యవసరమని ఎమ్మెల్యే వివరించారు. అలాగే కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)ను నియమించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కార్యదర్శి జి. ప్రతిభా దేవి స్పందిస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టు భవనాలను మంజూరు చేస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం పూర్తయ్యాక ఏజీపీని నియమించే ప్రక్రియ చేపడతామని తెలిపారు.
ఈ నిర్ణయంతో చింతలపూడి ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత సులభతరం కానున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి